తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై విచారించడానికి ఆమెకు వైద్య చికిత్సను అందించిన ముగ్గురు ఎయిమ్స్ వైద్యులకు జస్టిస్ ఎ. ఆర్ముగస్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 23, 24 తేదీల్లో అపోలో ఆసుపత్రిలో విచారణకు హాజరుకావాలని పల్మనాలజి విభాగం జి.సి.ఖిల్నానీ, అనస్థీసియాలజీ ప్రొఫెసర్ అంజన్ తిక్హా, కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ నితీష్ నాయక్లకు సమన్లు జారీ చేసింది. ఈ వైద్యుల పర్యవేక్షణలోనే 2016లో సెప్టెంబర్ 22, డిసెంబర్ 5, మధ్యకాలంలో ఆమె అపోలో హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆ వ్యవధి కాలంలో వారే ప్రత్యక్ష సాక్షులు కావడంతో కమిషన్ ఈ ముగ్గురు వైద్యులను విచారించనుంది. వారు కూడా తమకు సమన్లు జారీఅయినట్లు అంగీకరించారని సమాచారం. జయలలిత మరణంపై ఇప్పటి వరకు 75 మంది సాక్షులు, ఇతరులు ఏడుగురిని కమిషన్ ప్రశ్నించింది.