ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో భారతరత్న అటల్ బిహారి వాజపేయికి శ్రద్ధాంజలి ఘటించడానికి కార్పొరేటర్లంతా తీర్మానం చేశారు. అయితే ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ మతీన్ రషీద్ సంతాప తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ కార్పొరేటర్లు.. రషీద్పై దాడి చేశారు. దాడి చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. రషీద్ను తన్నుతూ.. చెప్పులతో చితకబాదారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్ల నుంచి ఎంఐఎం కార్పొరేటర్ను తప్పించారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే రషీద్ మద్దతుదారులు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి బీజేపీ కార్పొరేటర్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఓ కారు డ్రైవర్ను దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.