ఏలూరు: గోదావరి నది వరద నీరు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. యలమంచిలి మండలం పెద్దలంక దగ్గర వరప్రసాద్ అనే యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయాడు. కాగా... పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలోగల లంక గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. పుచ్చ లంక, పెదమల్లం లంక, అనగార లంక గ్రామాలు ప్రస్తుతం జల దిగ్భందంలో ఉన్నాయి. కాగా... పెదమల్లం మాచేనమ్మ ఆలయాన్నిగోదావరి వరదనీరు తాకింది.