తిరువనంతపురం : కేరళలో వరద ప్రాంతాలను ప్రధాని మోడీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. ముందుగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొచ్చిలో మోడీ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తాత్కాలిక సహాయం కింద 500 కోట్ల రూపాయలను ప్రకటించారు. సమావేశానంతరం ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, గవర్నర్ పి.సదాశివం, కేంద్ర పర్యాటక మంత్రి కె.జె. ఆల్ఫోన్స్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ వరదల్లో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలను మోడీ ప్రకటించారు.