తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర, ఛత్తీస్గడ్లలో కూడా వర్షాలు స్తుండటంతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 14.6 అడుగులకు చేరింది. అన్ని గేట్లను ఎత్తివేసి 14.15 లక్షల క్యూసెక్కులకు పైగా నీరుని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమలో లంక గ్రామాలకు భారీ వరద నీరు చేరుకుంది. కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 30కి పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ధవళేశ్శరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరగానే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.