తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేయడానికి టీటీడీ నిర్ణయించింది. ఈ వేలంపాటలో రెడీమేడ్ దుస్తులు, పాలిస్టర్, నైలాన్, నైలెక్స్ చీరలు, ఓణీలు, పట్టు పంచలు, కాటన్ చీరలు,283 లాట్లు విశాఖ పట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి లిమిటెడ్ వారు ఆగష్టు 23 నుండి 30 తేది వరకు ఈ -వేలం వేయనున్నారు.ఈ -వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.