అమరావతి: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మృతిపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నుపాటి విద్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. .రెండుసార్లు లోక్సభ సభ్యురాలిగా ఆమె సేవలు ప్రశంసనీయమని, మహిళాభ్యుదయం కోసం విద్య ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు. చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు అన్నారు.