న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కూతురు నమిత భట్టాచార్య ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాజ్పేయి అంతిమ సంస్కారాలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎల్కే అద్వానీ, అమిత్ షా, బీజేపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.