మాజీ ప్రధాని వాజ్పేయి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. స్మృతి స్థల్లో వాజ్పేయి భౌతిక కాయానికి త్రివిధ దళాల అధిపతులు పుష్పగుచ్ఛాలను సమర్పించి తమ నివాళులర్పించారు. మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి అంతిమ యాత్ర స్మృతి స్థల్కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు అంతిమయాత్రను అనుసరిస్తూ స్మృతి స్థల్కు నడిచి వచ్చారు. వాజపేయి అంత్యక్రియలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు.