న్యూఢిల్లి : మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయికి నివాళులు అర్పించడానికి వచ్చిన స్వామి అగ్నివేష్పై మరొకసారి దాడి జరిగింది. బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద కొంతమంది వ్యక్తులు అగ్నివేష్పై దాడి చేశారు. ఢిల్లి పోలీసులు అప్రమత్తమై స్వామి అగ్నవేష్ను రక్షించారు. గతంలోనూ స్వామి అగ్నివేష్పై దాడి జరిగింది. జార్ఖండ్లోని పాకూర్ జిల్లాలో బిజెవైఎం కార్యకర్తలు, ఎబివిపి విద్యార్థులు స్వామి అగ్నివేష్పై గత నెల 17న దాడి చేశారు.