విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం కనక దుర్గమ్మ ఆలయం కార్యనిర్వహణాధికారిగా (ఈఓ) వి.కోటేశ్వరమ్మ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ పక్కా ప్రణాళిక తో అమ్మ వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని వివాదాలకు అతీతంగా పని చేస్తానన్నారు. భక్తుల సేవే లక్యంగా శ్రమిస్తానన్నారు.