చింతూరు మన్యంలో శబరి నది పెరగడంతో మన్యంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చింతూరు మండలంలోని ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామమైన చిడుమూరు, శబరి నది, చికటీ వాగు, కుయుగురు వాగుల వద్ద వరద పరిస్థితిని కాకినాడ ఓఎస్డీ చక్రవర్తి, చింతూరు డిఎస్పీ డాక్టర్ దిలీఫ్ కిరణ్ లు పరిశీలించి, వాగుల వద్ద ప్రజలు దాటకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.