అనంతపురం : నగరంలో ఓ ప్రభుత్వ హైస్కూల్లో 9 వ తరగతి చదువుతున్న బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి లేని ఈ బాలిక నగరశివార్లలో ఓ కాలనీలో తండ్రి తో పాటు ఉంటోంది. కడుపులో గడ్డ ఉందని తండ్రి తో నమ్మబలుకుతూ వచ్చింది. ఈ రోజు తెల్లవారుజామున పురుటి నొప్పులు ఎక్కువవ్వటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డీఎస్పీ జె వెంకటరావు ఆస్పత్రికి వెళ్లి బాలికను పరమరామర్శించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని..బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా గడిచిన మూడు నెలలుగా బాలిక పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు.