విజయవాడ : కృష్ణా, మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరులో మైనింగ్ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా లక్షలు విలువ చేసే ఖనిజాలను, గ్రావెల్ ను, గ్రానైట్ మెటల్ ను అక్రమ రవాణా చేస్తున్న16 భారీ టిప్పర్లు, 6 ఇటుకల ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాహనాలను జి.కొండూరు పోలీసులకు అప్పగించారు.