న్యూఢిల్లి : మాజీ ప్రధాని వాజ్పేయి పార్థివ దేహం బిజెపి ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. వాజ్పేయి నివాసం కృష్ణమీనన్ పార్కు నుంచి దీన్దయాళ్ మార్గ్లోని బిజెపి కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహం చేరింది. మధ్యాహ్నం 1 గంట వరకూ వాజ్పేయికు నివాళులర్పించడానికి సందర్శకులను అనుమతిస్తారు. ఒంటి గంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్షా బిజెపి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియల కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి పార్థివ దేహానికి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లు నివాళులర్పించారు.