రాజమహేంద్రవరం : గోదావరి నది ఉధృతి పెరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప హెచ్చరించారు. నాటు పడవలపై ప్రయాణం చేయవద్దని ఆయన సూచించారు. వరద పరిస్థితిపై చినరాజప్ప అధికారులతో సమీక్షించారు. రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, అవుట్ఫాల్ స్లూయిస్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.