న్యూఢిల్లి : దేశంలో అమలవుతున్న అన్ని సంస్కరణలకు ఆద్యుడు వాజ్పేయి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్పేయి ఎంతో సహకరించారని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, వాజ్పేయి మృతి దేశానికి తీరనిలోటని ఆయన అన్నారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.