తిరుమల: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆర్జితసేవలను టీటీడీ అధికారులు పునరుద్ధరించారు.