గత 10 రోజులుగా వరదల తాకిడితో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం…కట్టలు తెంచుకుని ఊళ్లకు ఊళ్లను ముంచెత్తడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షకు పైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వరదల తాకిడికి గురవారం ఒక్కరోజే 30 మంది మృతి చెందగా..మృతుల సంఖ్య 94కు చేరింది. భారీ వర్షాలు, వరదలకు కొచ్చి విమానాశ్రయం ఇంకా నీటిలోనే నానుతోంది. మెట్రో రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వంది పెరియార్లో వరదలో చిక్కుకున్న 16 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.