న్యూఢిల్లి : భారతీయ జనతా పార్టీని ప్రారంభించి, తొలి అధ్యక్షుడిగా పని చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి చెందారు. గత కొంతకాలంగా వాజ్పేయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 9 వారాలుగా ఇక్కడి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న వాజ్పేయి నేడు అంతిమ శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. వాజ్పేయి మూత్ర పిండాల వ్యాధి, డయాబెటిస్, ఛాతీలో అసౌకర్యంతో వాజ్పేయి బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా వాజ్పేయి జ్ఞాపక శక్తిని కోల్పోయారు. వాజ్పేయి మృతి చెందారని ఎయిమ్స్ అధికారులు ప్రకటించే సమయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలైన ఎల్కె అద్వానీ తదితరులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి తదితరులు ఆసుపత్రిలోనే ఉన్నారు.