ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధినిర్వహణలో బాధ్యతగా పనిచేయాలి: కర్నూల్ డీఐజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 05:19 PM

రాయలసీమ రేంజ్ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పని చేస్తూ సిఐలుగా పదోన్నతి పొందిన నలుగురు ఎస్సైలు కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఘట్టమనేని శ్రీనివాస్ గారిని గురువారం డిఐజి గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా డిఐజి మాట్లాడుతూ అందరికి త్వరగా పదోన్నతులు కల్పించామన్నారు. బాగా పని చేసి పోలీసుశాఖకి మంచి పేరు తీసుకురావాలన్నారు. 


ఇంతకుమునపు చాలా ఏళ్ళకు పదోన్నతులు వచ్చేవన్న ఆయన ఇప్పుడు త్వరగా రావడం అభినందనీయమన్నారు. 3 అఫ్సన్స్ లూప్ లైన్ డిప్యూటేషన్ లకు, 3 లా అండ్ ఆర్డ్ ర్ పోలీసుస్టేషన్ల అపన్లు ఇచ్చి పోస్టింగ్ లు కల్పిస్తామన్నారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ సురేష్ బాబు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల సిఐలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com