రాయలసీమ రేంజ్ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పని చేస్తూ సిఐలుగా పదోన్నతి పొందిన నలుగురు ఎస్సైలు కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఘట్టమనేని శ్రీనివాస్ గారిని గురువారం డిఐజి గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా డిఐజి మాట్లాడుతూ అందరికి త్వరగా పదోన్నతులు కల్పించామన్నారు. బాగా పని చేసి పోలీసుశాఖకి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఇంతకుమునపు చాలా ఏళ్ళకు పదోన్నతులు వచ్చేవన్న ఆయన ఇప్పుడు త్వరగా రావడం అభినందనీయమన్నారు. 3 అఫ్సన్స్ లూప్ లైన్ డిప్యూటేషన్ లకు, 3 లా అండ్ ఆర్డ్ ర్ పోలీసుస్టేషన్ల అపన్లు ఇచ్చి పోస్టింగ్ లు కల్పిస్తామన్నారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ సురేష్ బాబు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల సిఐలు పాల్గొన్నారు.