ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సిద్దా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 04:47 PM

ప్రకాశం: రాష్ట్రంలో ప్రతి పేదవానికి 15 రూపాయలకు ప్రభుత్వం మూడుపూటలా భోజనం అందిస్తుoదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ శిద్దా రాఘవరావు అన్నారు. గురువారం ఒంగోలు పాత రిమ్స్ హాస్పిటల్ ప్రాoగణములో అన్న క్యాంటీను రాష్ట్రా అటవీశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక లేని సమాజం నిర్మిచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు భోజనానికి ఇబ్బందులు పడకూడదని పేద ప్రజలకు 5 రూపాయలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభత్వానికి 58 రూపాయల ఖర్చు అయినప్పటికీ 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడము జరిగిందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు చంద్రబాబునాయుడు గారిని దేవుడుగా భావిస్తున్నారన్నారు. 


పేద ప్రజలుకు ఆకలి తీర్చినందుకు ముఖ్యమంత్రిని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. ఒంగోలు నగరంలో ప్రస్తుతం 4 అన్న క్యాంటీనులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలో మరో 2 అన్న క్యాంటీనులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామాచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒంగోలు నగరంలో ప్రజలకుఅవసరమైన ప్రాoతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com