కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మండవల్లిలో సొసైటీ సొంత భవనంలో కోపరేటివ్ బ్యాంక్ 52 వ శాఖను ప్రారంభించారు ఆప్కోబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా కోపరేటివ్ సోసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మొత్తం జిల్లాలో 52 కోపరేటివ్ బ్యాంకులు ప్రారంభించామన్నారు. వాటినే కార్పొరేట్ స్థాయిలో అన్ని హుంగులతో అనగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏసి, ఆన్లైన్ సౌకర్యం, ఇటరీల్ డెకరేషన్ సౌకర్యాలు కల్పించేందుకు 6 కోట్లు వెచ్చించామన్నారు. 375 బ్యాంకులతో జాతీయ స్థాయిలో రెండవ స్తానంలో ఉన్నామన్నారు. 50 పైసలకే రైతులకు రుణాలు అందిస్తున్నామన్న వెంకటేశ్వరరావు వచ్చిన లాభాలను 8కోట్లకు పైగా సొసైటీ సభ్యులకే అందించామన్నారు.