నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం వలసపల్లి గ్రామ రైతులు నకిలీ మిరప విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ మేరకు తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ఆర్డీఓ కార్యాలయం వరకూ జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తదనంతరం తహశీల్దార్, వ్యవసాయశాఖ అధికారులు రైతులతో సంప్రదింపులు చేయగా తమకు న్యాయం చేసేంతవరకూ ఆర్డీఓ కార్యాలయం వద్దనే ఆందోళన చేస్తామని బాధిత రైతులు హెచ్చరించారు.