ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మిర్చిరైతులు పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 04:07 PM

నూజివీడు :  కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం వలసపల్లి గ్రామ రైతులు నకిలీ మిరప విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ మేరకు తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నూజివీడు ఆర్డీఓ కార్యాలయం వరకూ జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తదనంతరం తహశీల్దార్‌, వ్యవసాయశాఖ అధికారులు రైతులతో సంప్రదింపులు చేయగా తమకు న్యాయం చేసేంతవరకూ ఆర్డీఓ కార్యాలయం వద్దనే ఆందోళన చేస్తామని బాధిత రైతులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com