న్యూఢిల్లి : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. కేంద్రమంత్రులు, బిజెపి, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎయిమ్స్ ఆసుపత్రికి చేరి వాజ్పేయి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు దర్మేంద్ర ప్రధాన్, జితేంద్ర సింగ్ మరికొందరు బిజెపి నేతలు వాజ్పేయి నివాసానికి వచ్చారు. వాజ్పేయి నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు మొదలైన అంశాలను వారు పరిశీలించారు.