ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి ఎన్. అమరనాథ రెడ్డి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని ప్రతి వార్డును తనిఖీ చేసి కొద్దిసేపు రోగులతో మాట్లాడారు. ఆస్పత్రి డాక్టర్లు అందిస్తున్న చికిత్స విధానం, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు బసవతారకం మదర్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ ఎ స్. గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, బి. ఎన్. రాజసింహులు(దొరబాబు), చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు.