ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 02:51 PM

పంచాయతీ లలో పారిశుధ్యం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేటలో ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయం లో గురువారం కపిలేశ్వరపురం,రాయవరం మండలాల గ్రామపంచాయితీ ప్రత్యేక అధికార్లు ,పంచాయితీ కార్యదర్శులతో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశం లొ ఎంఎల్ఎ మాట్లాడుతూ పంచాయితీలకు వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజల సమస్యలను సామరస్యంగా అడిగి తెలుసుకుని తగుచర్య తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో పారిశుధ్యంపై దృష్టిసారించి ఏరోజు కారోజు చెత్తను తీసివేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేతిపైపులు, కుళాయిలు సక్రమంగా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. వీధిలైట్లు నిర్వహణకు ప్రత్యేక భాద్యత తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. 


ప్రతీ గురువారం, శుక్రవారం నిర్వహిస్తున్న గ్రామ దర్శిని లో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి పెట్టుబడి నిధి రానివారి వివరాలు, చంద్రన్న భీమ బాండ్లు రానివారి , రేషన్ సరుకులు తీసుకోని వారి వివరాలు తీసుకుని వాటిపై తగుచర్య తీసుకోవలన్నారు. దీనిపై తనకు సమాచారం తెలియజేయలని పేర్కొన్నారు. గ్రామాలలో ఎన్.ఆర్.ఇ.జి.యస్ మ్యాచింగ్ గ్రాంటుతో శాంక్షన్ అయిన పనులను ప్రత్యేక అధికార్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించి పూర్తిచేయలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల తహశ్శిల్దార్ లు, రెండు మండలాల ఎంపిడిఒలు, గ్రామపంచాయితీ కార్యదర్శులు, కపిలేశ్వరపురం మండల పంచాయితీరాజ్ ఎ.ఇ.,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com