కేరళలో తుఫాను తీవ్రతకు 75మంది మృతి చెందారు. వరద తీవ్రత ఎక్కువకావడంతో 12జిల్లాలో హై ఎలర్ట్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలను చేపట్టమని మోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరత తీవ్రతతో స్కూళ్లు..కాలేజ్లకు సెలవు ప్రకటించారు.