ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా చైతన్య కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ జేడీ లక్షినారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 01:15 PM

విజయనగరం జిల్లా ప్రజా చైతన్య కేంద్రాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఏపీలోని 9 జిల్లాల్లో క్షేత్రస్తాయిలో పర్యటించామని.. అనేక పథకాలున్నా రైతులకు, పేద ప్రజలకు అందడం లేదని.. ఎమ్మార్వో కార్యాలయాలకి వెళ్లి పనులు చేయించుకోలేకపోతున్నారన్నారు. జియాన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా చైతన్య కేంద్రాలు పేద ప్రజలకు, రైతులకు ఎమ్మార్వో, పోలీస్ కార్యాలయాల పనుల కోసం సహాయ సహకారాలు అందిస్తారన్న ఆయన ప్రజా చైతన్య కేంద్రంలో రిటైర్డ్ అదికారులు అందుబాటులో ఉంటారన్నారు. మద్యం మానేసిన గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని ప్రకటించానన్న ఆయన గజపతినగరం మండలం సీతారంపురం నా మూడో దత్తత గ్రామం అని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com