శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంటలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బాలు టీ, కూల్ డ్రింక్స్ షాపులో ప్రభుత్వ నిషేధిత గుట్కా, పాన్ పరాక్, ఖైనీలు మొదలైనవి అమ్ముతున్నాడని, రెండవ పట్టణ ఎస్ఐ ఓబులేసుకు సమాచారం రావడంతో వెంటనే షాప్ వద్దకు వెళ్లి తనిఖీ చేసి గుట్కా, పాన్ పరాక్, ఖైనీలను స్వాధీన పరుచుకుని షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత గుట్కా, పాన్ పరాక్, ఖైనీలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.