న్యూఢిల్లి : మాజీ ప్రధాని వాజ్పేయి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న వాజ్పేయి ఆరోగ్యం పూర్తిగా విషమంగా మారడంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నారు. బిజెపి అగ్రనేతలతో సహా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఎయిమ్స్కు తరలి వస్తున్నారు. ఎయిమ్స్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ పరిసరాల్లో వాహనాలను ఆసుపత్రి సిబ్బంది అక్కడినుంచి ఖాళీ చేయిస్తున్నారు.