విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్'ను ప్రారంభించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, అక్కడ తాను దిగిన సెల్ఫీలను టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పంచుకున్నారు. విజయవాడ నగరానికే తలమానికమైన ప్రకాశం బ్యారేజి వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్'ను ప్రారంభించడంతో, ఈ ప్రాంతానికి మరింత అందం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో బ్యారేజి వద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామని తెలిపారు.