ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎస్ఎస్ సి, ఇంటర్ ఫలితాలను గురువారం విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు. ఎస్ ఎస్ సికి సంబంధించి మొత్తం 12,216 మంది విద్యార్థులకు 5, 824 మంది అంటే 47.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ కు సంబంధించి మొత్తం 11, 355 మందికి గాను 4, 728 మంది అంటే 41.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.