న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్బులెటిన్ విడుదల చేశారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ఎయిమ్స్కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఆస్పత్రికి వచ్చి వాజ్పేయిని పరామర్శిస్తున్నారు. ఉదయం నుంచి బీజేపీ నేతలు, పలు రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. వాజ్పేయి కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. ఎయిమ్స్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.