కేరళ : కేరళ రాష్ట్రంలో గత వారంరోజులకు పైబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి నదులు పొంగి ఊళ్లను ముంచెత్తడంతో వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా…పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వేల సంఖ్యలో ప్రజలు తలదాచుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా అక్కడి పరిస్థితి మెరుగుపడటం లేదు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పంపానది కి వరద అంతకంతకూ పోటెత్తుతోంది. తాజా శబరిమలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అయ్యప్పస్వామి సన్నిథి నీట మునిగింది.