బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిజెపి నేతలు ఎయిమ్స్కు క్యూ కడుతున్నారు. కాగా వాజ్పేయి ఆరోగ్యం బాగుపడాలంటూ పలువురు హోమాలు నిర్వహిస్తున్నారు.