ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 10:09 AM

ఢిల్లీ:  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం వృద్ధాప్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో బీజేపీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం విజయవాడలో ఏపీ బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేశారు.


ఈ రోజు ఉదయమే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయికి అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఆయనను ఇప్పటికే పరామర్శించి వచ్చారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12న ఆస్పత్రిలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com