న్యూఢిల్లి : బొగ్గు గనుల కేటాయింపు కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు, మరొక 14 మందికి ఢిల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15వ తేదీన కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడి భారీగా లంచాలు ఇచ్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి జిందాల్కు కోర్టు సమన్లు జారీ చేసింది.