న్యూఢిల్లీ : రాజకీయ వేత్తగా మారిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూపై సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధు వెళితే అతడిని దేశద్రోహిగా పరిగణిస్తామని పేర్కొన్నారు. సిద్ధి మానసిక స్థిరత్వం ఉన్న వ్యక్తి అయితే ఇమ్రాన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోరని పేర్కొన్నారు. ఇలా ఉండగా సిద్ధు నిన్న పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి పాక్ పర్యటనకు అనుమతి కోరారు. సిద్ధూతో పాటు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లకు కూడా పాక్ ప్రధానిగా ఇమ్రాన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది.