ఎన్నికల ముందు కడప జిల్లా ప్రజలకు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పై వివక్ష చూపుతున్నారని కడప జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కే.సురేష్ బాబు ధ్వజమెత్తారు. కడప వైస్సార్సీపీ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామి రెడ్డి, ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి, బద్వేల్ నియోజకవర్గ సమన్వయ కర్త వెంకట సుబ్బయ్య, కడప వై.సి.పి.సోషల్ మీడియా పార్లమెంటరీ కో- ఆర్డినేటర్ తెలుగుపులి దుర్గాప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.