కృష్ణా : వీరులపాడు మండలం పల్లెం పల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వైరా కట్టలేరును కృష్ణాజిల్లా ఎస్పీ సర్వే శ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోందని దాములూరు పల్లెం పల్లిమధ్య రాకపోకలను లేకుండా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది నియమించాలని సూచించారు. జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందన్నారు.