గుంటూరు జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం నకరీకల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటిస్తున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.