చెన్నై : డీఎంకే పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడినే కాదు.. ఒక మంచి తండ్రిని కూడా కోల్పోయానని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్టగళన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో కరుణానిధికి సంతాపం తీర్మానం చేశారు. అనంతరం డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్ ఎంపికపై చర్చించారు. డీఎంకే అధ్యక్ష పదవి కోసం స్టాలిన్తో పాటు ఆళగిరి కూడా పోటీ పడుతున్న విషయం విదితమే.