నెల్లూరులోని నూతన జెడ్పీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, జేసీ సెల్వి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. దివంగత జెడ్పీ మాజీ చైర్మన్ డేగా నరసింహారెడ్డికి సభ సంతాపం తెలిపింది.