న్యూ ఢిల్లీ : రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడుతూ మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయం ఎదురవుతుందని తెలిపారు. తాజా సర్వేతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. అయితే ఇదే సర్వే ప్రధాని పదవికి ఇప్పటికీ నరేంద్ర మోదీయే సరైన వ్యక్తని పెద్దసంఖ్యలో ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు పేర్కొనడం గమనార్హం. కాగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో పాలక బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే కాంగ్రెస్ కి కలిసివస్తున్నదని సర్వే అభిప్రాయాన్ని తెలియజేసింది.