అమరావతి: బ్యాంకాక్లో ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడు కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసి పల్లంపాటి వెంకటేశ్గా గుర్తించారు. హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో వెంకటేశ్ పనిచేస్తున్నాడు. కార్యాలయం పని నిమిత్తం బ్యాంకాక్ వెళ్లినట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు.