ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 12:35 AM

నెల్లూరు నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సమస్యలపై ముగు ్గరు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. కమిటీ సూచనల అనంతరం సమస్యలన్నింటినీ సాను కూలంగా పరిష్కరిస్తామన్నారు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నేతలు జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను హైదరా బాద్‌లో కలిసి యూనివర్శిటీ సమస్యలను ప్రస్తావించిన నేపథ్యంలో మంత్రి గంటా మంగళవారం నెల్లూరు చేరుకున్నారు. ముందుగా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నూతన భనవంలో వసతులను పరిశీలించారు. అనంతరం వీఎస్‌యు పరిపాలన భవనంలో ఉపకులపతి వీరయ్యతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా చర్చించి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. అందులో ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com