వియత్నాం ఓపెన్ టూర్ 100 టోర్నమెంట్లో భారత షట్లర్ అజయ్ జయరాం ఫైనల్కు దూసుకెళ్లాడు. మరో ఆటగాడు మిథున్ సెమీస్లో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జయరాం 21-14, 21-19 యు ఇగర్షి(జపాన్)పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లాడు. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో జయరాం అద్భుతంగా ఆడాడు. తొలి గేమ్లో ప్రత్యర్థి పుంజుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఇద్దరూ పాయింట్ల కోసం పోటీపడ్డారు. కానీ, చివరికి ఒత్తిడిని జయించిన జయరాం గేమ్ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్లో విజయంతో ఫైనల్కు దూసుకెళ్లాడు.