రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తూ, చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు ఇస్తుంటే జగన్ చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. జగన్ లూటీ చేసిన ప్రజలు సొమ్మును టీడీపీ ప్రభుత్వం రికవరీ చేసి తీరుతుందన్నారు. ప్రజల సొమ్ము వారికే చెందాలన్నారు. తక్కువ వర్ష పాతం పడినా జాగ్రత్త చేసి వినియోగిస్తున్నామన్నారు.