ప్రజానాట్యమండలి ప్రకాశం జిల్లా శిక్షణ తరగతులు చీరాల లొని ILTD కంపెనీ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పుల్లారావు గారు మాట్లాడుతూ… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పట్టుదలతో కళలని నేర్చుకోవాలని అన్నారు. సీఐటీయూ జిల్లా నాయకులు కొండారెడ్డి మాట్లాడుతూ… కార్మికులు ఎదుర్కొనే సమస్యలను కళారూపాల ద్వారా ప్రజలకు త్వరగా చేరతాయని అన్నారు. కార్యక్రమంలో ఐఎల్టీడీ ఫెడరేషన్ నాయకులు గోసాల సుధాకర్ రావు, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు ఉబ్బా కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి పి సురేష్, బి పేతురు, స్థానిక కార్యదర్శి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.